- ఒకటి కంటే ఎక్కువ సదుపాయాల కల్పనకు ఉద్దేశించి నిర్మించిన ప్రాజెక్టునే బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు.
- భారతదేశంలో వ్యవసాయ నీటిపారుదల, గృహ, పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా, విద్యుదుత్పాదన, వరద నివారణ, స్థానిక రవాణా, భూ సంరక్షణ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, విహారయాత్ర, కృత్రిమ వనాల పెంపకం మొదలైన అనేక ప్రయోజనాల కోసం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
- బెంగాల్లో 1948లో వరదలను, వాటిఅనుబంధ సమస్యలను నివారించడానికి దామోదర్ నదీ, దాని ఉపనదులపైన ప్రాజెక్టులు కట్టడం కోసం మొట్టమొదటి నదీలోయ ప్రాజెక్టు సంస్థను ఏర్పాటు చేశారు.
- ఈ సంస్థను అమెరికాలోని టెన్నిస్ వేలీ అథారిటీ (టీవీఏ) నమూనా ఆధారంగా ఏర్పాటు చేశారు.
- 1948 ఫిబ్రవరి 18న భారత పార్లమెంట్ ఈ సంస్థను ఆమోదించడంతో ఇది దామోదర్ లోయ కార్పొరేషన్ (డీవీసీ)గా వాస్తవ రూపం దాల్చింది.
- డీవీసీ ఏర్పడక ముందు వరదలతో బెంగాల్ దుఃఖదాయినులుగా దామోదర్, దాని ఉపనదులున్నాయి. తర్వాత వాటిపై ప్రాజెక్టులు నిర్మించడంతో బెంగాల్ వరదాయినులుగా ఉన్నాయి.
- భారతదేశంలో నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు.
అవి...
- భారీ నీటిపారుదల పథకాలు
- మధ్య తరహా నీటి పారుదల పథకాలు
- చిన్న తరహా నీటి పారుదల పథకాలు
ప్రాజెక్టు కల్పించే నీటి పారుదల విస్తీర్ణాన్ని బట్టి ప్రాజెక్టులను విభజించారు.
- భారీ నీటిపారుదల పథకాలు
10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలను భారీ నీటిపారుదల పథకాలు అంటారు. వీటిని ప్రధానంగా నదులపై నిర్మిస్తారు.
- మధ్య తరహా నీటిపారుదల పథకాలు
2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు. వీటిని నదులపై, ఉపనదులపై నిర్మిస్తారు.
- చిన్న తరహా నీటిపారుదల పథకాలు
2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు గల పథకాలు. భూగర్భ జల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ తరహా పథకాల్లోకి వస్తాయి.
భూగర్భ జల పథకాలు: సాధారణ బావులు, గొట్టపు బావులు. ఉపరితల జల పథకాలు: చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు.
ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం నీటిపారుదల ఆవశక్యత, ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూడ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1974-75లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో 1990లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేశారు. 2008 నవంబర్ 4న గంగానదిని ‘జాతీయ నది’గా ప్రకటించారు.
దేశంలో కొన్ని ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టులు
- భాక్రానంగల్ ప్రాజెక్టు
దేశంలో నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు, అన్నిటికంటే పెద్దది. దీన్ని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1962 అక్టోబర్ 22న జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి పథకం. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ కూడా లబ్ధి పొందుతోంది. సట్లేజ్ నదిపై హిమాచల్ప్రదేశ్లో భాక్రా అనే ప్రాంతంలో భాక్రా ఆనకట్ట (226 మీటర్లు), పంజాబ్లోని నంగల్ ప్రాంతం వద్ద నంగల్ ఆనకట్ట(29 మీటర్లు)ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు 1204 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుంది.
- హీరాకుడ్ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టును ఒడిశాలో మహానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. దీన్ని విద్యుదుత్పాదన, నీటిపారుదల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు.
- నాగార్జున సాగర్ ప్రాజెక్టు
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నందికొండ గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల పథకం. దీనికి భారత తొలి ప్రధాని నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు 1450 మీటర్ల పొడవుతో, రాతి కట్టడపు ఆనకట్టల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందింది. దీని కుడి కాలువను జవహర్ కాలువ అంటారు. ఈ కాలువ 204 కి.మీ. పొడవు ఉంది. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తుంది. దీని ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అంటారు. ఈ కాలువ 179 కి.మీ. పొడవుతో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది.
- దామోదర్ నదీలోయ ప్రాజెక్టుఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం బెంగాల్ ప్రాంతాన్ని.. దామోదర్ నది, దాని ఉపనదుల వల్ల వచ్చే వరదల నుంచి కాపాడడం. ఈ పథకంలో భాగంగా తిలయ్యా, మైథాన్ ఆనకట్టలు - బరాకర్ నదిపై, పంచట్హిట్ ఆనకట్ట - దామోదర్ నదిపై, కోనార్ ఆనకట్ట- కోనార్ నదిపై నిర్మించారు.
- బియాస్ పథకం
ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. బియాస్ నదిపై ‘పోంగ్’ వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు.
- కోసి ప్రాజెక్టు
దీన్ని బీహార్ - నేపాల్ సరిహద్దులోని హనుమాన్నగర్ సమీపంలో ‘కోసి’ నదిపై నిర్మించారు. ఇది అంతర్జాతీయ పథకం
- గండక్ పథకం
దీన్ని బీహార్లోని వాల్మీకినగర్ వద్ద గండక్ నదిపై నిర్మించారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ల ఉమ్మడి పథకం.
- చంబల్ పథకం
ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని చంబల్ నదిపై నిర్మించారు. ఈ పథకంలో మూడు ఆనకట్టలున్నాయి. అవి ...
- గాంధీసాగర్ ఆనకట్ట
- రాణా ప్రతాప్సాగర్ ఆనకట్ట
- జవహర్ సాగర్ ఆనకట్ట
- తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఢిల్లీ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని ‘భాగీరథి’ నదిపై హిమాలయ ప్రాంతం(ఉత్తరాఖండ్)లోని భూకంపాలు సంభవించే ప్రదేశంలో నిర్మించడం వల్ల ఇది వివాదాస్పదమైంది. తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి - సుందర్లాల్ బహుగుణ.
- ఇందిరాసాగర్ ప్రాజెక్టు
ఇది నర్మద నదిపై ఉంది. దీన్ని గుజరాత్లోని పూర్ణసా ప్రాంతంలో నిమొరి జిల్లాలో నిర్మించారు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ల ఉమ్మడి ప్రాజెక్టు
- సర్దార్ సరోవర్ ప్రాజెక్టు
దీన్ని నర్మద నదిపై, గుజరాత్లోని బరూచ్ జిల్లాలో బడగావ్ అనే ప్రాంతంలో నిర్మించారు. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మేథాపాట్కర్ చేపట్టిన ఉద్యమమే- నర్మదా బచావో.
మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు
వ.సం.
|
ప్రాజెక్టు పేరు
|
నది
|
రాష్ట్రాలు
|
1.
|
బాగ్లీహార్ ప్రాజెక్టు
|
చీనాబ్
|
జమ్మూ - కాశ్మీర్
|
2.
|
ధూల్హస్తి
|
చీనాబ్
|
జమ్మూ - కాశ్మీర్
|
3.
|
నాథ్పాజాక్రి
|
సట్లేజ్
|
హిమాచల్ ప్రదేశ్
|
4.
|
రిహాండ్
|
రిహాండ్
|
ఉత్తరప్రదేశ్
|
5.
|
రామ్గంగా
|
రామ్గంగా
|
ఉత్తరప్రదేశ్
|
6.
|
సువర్ణరేఖ
|
సువర్ణరేఖ
|
బీహార్
|
7.
|
ఫరక్కా
|
హుగ్లీ
|
పశ్చిమ బెంగాల్
|
8.
|
మయూరాక్షి
|
మురళీ
|
పశ్చిమ బెంగాల్
|
9.
|
జయక్వాడీ
|
గోదావరి
|
మహారాష్ర్ట
|
10.
|
బాబ్లీ
|
గోదావరి
|
మహారాష్ర్ట
|
11.
|
ఆల్మట్టి
|
కృష్ణా
|
కర్ణాటక
|
12.
|
ఇడుక్కి
|
పెరియార్
|
కేరళ
|
13.
|
శబరిగిరి
|
పంప
|
కేరళ
|
14.
|
మెట్టూరు
|
పైకారా
|
తమిళనాడు
|
15.
|
ఉకాయ్
|
తపతి
|
గుజరాత్
|
16.
|
కాక్రపార
|
తపతి
|
గుజరాత్
|
17.
|
శ్రీరాంసాగర్
|
గోదావరి
|
తెలంగాణ
|
18.
|
సుంకేసుల
|
తుంగభధ్ర
|
ఆంధ్రప్రదేశ్
|
19.
|
పులిచింతల
|
కృష్ణానది
|
ఆంధ్రప్రదేశ్
|
20.
|
జంఝావతి
|
జంఝావతి నది
|
ఆంధ్రప్రదేశ్
|
21.
|
ఎల్లంపల్లి(శ్రీ పాదసాగర్)
|
గోదావరి
|
తెలంగాణ
|
|
0 comments:
Post a Comment